ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు ప్రజలంతా విద్యుత్ లైట్లను ఆపేస్తే పవర్ గ్రిడ్పై లోడ్ పెరిగిపోయి అది కుప్పకూలుతుందని వాదనలు సామాజిక మాధ్యమాల్లో బాగా వ్యాప్తి చెందుతున్నాయి. శుక్రవారం ఉదయం ప్రధాని వీడియో సందేశం పూర్తయిన కాసేపటికే ఇలాంటి వదంతులు వందల సంఖ్యలో పుట్టుకొచ్చాయి. అంతేకాక, అవి అత్యంత వేగంగా సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిపోయాయి. అసలు నిజాలు తెలియని చాలా మంది వాటిని నిజం అనుకొని గ్రూపుల్లో ఫార్వర్డ్లు చేస్తున్నారు. కొందరు నాయకులు కూడా మోదీ పిలుపును వ్యతిరేకించారు. దీనిపై పునరాలోచన చేయాలని మహారాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి డాక్టర్ నితిన్ రావత్ కూడా వ్యాఖ్యానించారు. అన్ని లైట్లు స్విచ్ ఆఫ్ చేస్తే, లోడ్ పెరిగిపోయి అది గ్రిడ్ వైఫల్యానికి దారితీస్తుందని, తద్వారా అత్యవసర సేవలు నిలిచిపోతాయని ఆయన అన్నారు. అయితే, తాజాగా ఈ వదంతులపై తెలంగాణ ట్రాన్స్కో జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు వివరణ ఇచ్చారు.
లైట్లన్నీ ఆపేస్తే పవర్ గ్రిడ్ కుప్పకూలుతుందా? లోడింగ్ సేఫ్టీ టెక్నిక్స్ ఇవే..