రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుండగా.. కరోనా రోగులతో కొత్త చిక్కులు వస్తున్నాయి. సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ కరోనా రోగి.. ఆస్పత్రి సిబ్బంది కళ్లుగప్పి పారిపోయాడు. హైదరాబాద్లో ఇది కలకలం రేపుతోంది. గద్వాలకు చెందిన ఓ వ్యక్తి కరోనా లక్షణాలతో కొద్ది రోజుల కిందట గాంధీ ఆసుపత్రిలో చేరాడు. వైద్యులు అతడిని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే.. ఆదివారం (ఏప్రిల్ 5) రాత్రి అతడు అందరి కళ్లుగప్పి ఆస్పత్రి నుంచి పరారయ్యాడు.
కరోనా పెషెంట్ పారిపోయిన విషయం గుర్తించిన గాంధీ ఆస్పత్రి సిబ్బంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనను తీవ్రంగా పరగణించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కరోనా బాధితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఆస్పత్రి పరిసర ప్రాంతాలైన చిలకలగూడ, పద్మారావునగర్తో పాటు అతడి స్వస్థలమైన గద్వాలలోనూ పోలీసులు గాలిస్తున్నారు.